- Advertisement -
నితిన్,రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం శ్రీనివాసకళ్యాణం. శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీస్ విఘ్నేశ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుత నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు.
ఆగస్టు 9న శ్రీనివాస కళ్యాణం విడుదలవుతుంది. ఆ తేదీనే ఎందుకంటే దిల్ రాజు నిర్మించిన బొమ్మరిల్లు సినిమా ఆగస్టు 9నే విడుదల అయ్యి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ తేదీనే శ్రీనివాసకళ్యాణం కూడా విడుదల చేయలని దిల్ రాజు భావిస్తున్నాడు.