సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆయన నటించిన చెక్, రంగ్దే సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. భీష్మ హిట్ కొట్టాక.. ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం హిందీలో సక్సెస్ అయిన అంధాదున్ రీమేక్ మాస్ట్రోలో నితిన్ నటిస్తున్నాడు. ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
నితిన్కు జోడీగా నభా నటేశ్ చేస్తోంది. ఇక తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయినట్టు సమాచారం.ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తేశారు కాబట్టి.. సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. నితిన్ కు ఇది 30 వ సినిమా. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాకు జె.యువరాజ్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నట్టు టాక్. ఇటీవల నితిన్ విభిన్న కథాంశాలు, పాత్రలు ఎంపిక చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే చెక్ సినిమా చేశాడు. కానీ ఈ మూవీ బోల్తా కొట్టింది. ఆ తర్వాత విడుదలైన రంగ్దే కూడా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం హిట్ కోసం నితిన్ ఎదురుచేస్తున్నాడు.
Also Read
పాన్ ఇండియా వైపు దూసుకెళ్తున్నామా.. సొంత ఇలాకా అప్పగిస్తున్నామా?