Friday, May 10, 2024
- Advertisement -

రజనీ, చిరు కాదు.. సోలోగానే తేల్చుకోవాలనుకొంటున్న రాజమౌళి!

- Advertisement -

దర్శకుడు రాజమౌళి అంటే..”ఈగ” ను హీరోగా చేసుకొని సూపర్ హిట్ సినిమా చేసిన వ్యక్తి. హీరోల అవసరం లేకుండా హిట్ కొట్టిన నేపథ్యం ఉన్న వ్యక్తి. మరి ఒక సినిమానే అలా చుట్టేసిన వ్యక్తికి… కేవలం సినిమా ప్రమోషన్ కోసం హీరోల అవసరం ఉండకపోవచ్చు.

అందుకే.. ఇప్పుడు ఆయన సోలోగానే తేల్చుకొందామని అనుకొంటున్నాడని తెలుస్తోంది.. ‘బాహుబలి- ది బిగినింగ్’ కు ఆడియో విడుదల వేడుకకు మొదట ప్రముఖ హీరోలు అటెండ్ అవుతారని వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని.. కథనాలు వచ్చాయి. వారందరి ఆధ్వర్యంలో ఈ సినిమా ఆడియో విడుదల అవుతుందని.. తద్వారా సినిమాపై అంచనాలను పెంచుకొనే అవకాశాన్ని ఉపయోగించుకొవచ్చని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు రాజమౌళి ఆలోచన మారినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఆడియోను స్టార్ల ప్రమేయం లేకుండానే విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. చిరంజీవి, రజనీ వంటివారు కాకుండా.. కేవలం బాహుబలి సినిమా యూనిట్ సమక్షంలోనే ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నారని సమాచారం. బయటి వారిని నమ్ముకోకుండా.. కేవలం సినిమా యూనిట్ ద్వారానే ముందుకు వెళుతూ రాజమౌళి సోలోగానే తేల్చుకోనున్నాడనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -