యూవీ క్రియేషన్స్ పతాకంపై అనుష్క శెట్టి.. నవీన్ పొలిశెట్టి హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి అనే టైటిల్ను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక ‘రా రా కృష్ణయ్య’ ఫేం మహేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని టాక్. 40 ఏళ్ల మహిళతో.. 25 ఏళ్ల కుర్రాడు ప్రేమలో పడితే ఎటువంటి పరిణామాలు ఎదరవుతాయి.. అనే సబ్జెక్ను ఈ మూవీలో ఫన్నీగా చూపించబోతున్నారట. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం అనుష్క ఈ మూవీ కోసం కసరత్తులు చేసింది. ఆమె సన్నబడగానే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతున్నది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫేం విజయ్దేవరకొండ ఓ కీలకపాత్రలో పోషించబోతున్నాడట. నవీన్ పొలిశెట్టితో ఉన్న ఫ్రెండ్ షిప్తో ఆ ప్రాజెక్టులో చేసేందుకు విజయ్ ఒప్పుకున్నట్టు టాక్. ఇక జాతి రత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి క్రేజీ ఆఫర్ కొట్టేశాడు. అనుష్కకు కూడా గత కొన్నేళ్లుగా సక్సెస్లు లేవు. ఆమె బరువు పెరగడం.. కుర్ర హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో అనుష్కకు అవకాశాలు తగ్గాయి.
Also Read:‘మేజర్’ మార్కెట్ మామూలుగా లేదుగా..
దీంతో ఆమె లేడీ ఓరియంటెడ్, విభిన్న కథా చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది.ఈ క్రమంలో అనుష్క మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. టైటిల్తో నే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విజయ్ దేవరకొండ నటిస్తుండటంతో ఈ మూవీ రేంజ్ మరింత పెరిగిపోయింది.