Saturday, May 18, 2024
- Advertisement -

కాలేజ్‌కి వెళ్తోన్న ఎన్టీఆర్‌

- Advertisement -

ఎన్టీఆర్ వ‌రస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు.టెంప‌ర్‌తో మొద‌లైన అత‌ని హిట్లు జైల‌వ‌కుశ వ‌ర‌కు కొన‌సాగుతు వ‌స్తుంది.ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత సినిమా చేస్తున్నాడు.ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజ హెగ్డె,ఇషా రెబ్బా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఒక కాలేజ్ లో జరుగుతోంది. కాలేజ్ నేపథ్యంలో ఎన్టీఆర్ , పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలను నిన్నటి నుంచి చిత్రీకరిస్తున్నారు.

లవ్,రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. జగపతిబాబు ,నాగబాబు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. ఆగస్టు 15వ తేదీన ఫస్టు టీజర్ ను,అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ క‌నిపిస్తార‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -