Sunday, May 5, 2024
- Advertisement -

తండ్రి మ‌ర‌ణం త‌రువాత మొద‌టిసారి షూటింగ్‌కు ఎన్టీఆర్‌

- Advertisement -

తండ్రి హ‌రికృష్ణ చ‌నిపోయిన త‌రువాత ఎన్టీఆర్ మొద‌టిసారి సినిమా షూటింగ్‌కు వెళ్లారు.తను ఎంతగానో ప్రేమించిన తన తండ్రి నందమూరి హరికృష్ణను యాక్సిడెంట్ లో కోల్పోయారు ఎన్టీఆర్‌.ఈ ఘ‌ట‌న జ‌రిగిన నాలుగు రోజుల‌కే ఎన్టీఆర్ త‌న సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయ‌ల‌ని ప్లాన్ చేశారు.కాని హ‌రికృష్ణ మ‌ర‌ణంతో అర‌వింద స‌మేత సినిమా వాయిదా ప‌డుతుంద‌ని అంద‌రు భావించారు.

తన వ‌ల్ల సినిమా నిర్మాత‌లు న‌ష్ట‌పోకూడ‌ద‌ని ఉద్దేశంతో ఎన్టీఆర్ అర‌వింద స‌మేత సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు.దీంతో సినిమా ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడని స‌మాచారం.ఎన్టీఆర్‌ స‌ర‌స‌న పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు న‌టిస్తున్నారు.ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గ‌త బుధ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.అభిమాని ఇంట్లో పెళ్లి నిమిత్తం నెల్లురు వెళ్తుండగా న‌ల్గొండ జిల్లాలోని అన్నేప‌ర్తి గ్రామంలో జ‌రిగిన కారు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ మ‌ర‌ణించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -