బాహుబలి సినిమా తరువాత లాంగ్గ్యాప్ తీసుకున్న జక్కన్న ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేందుకు చాలా సమయం తీసుకున్నాడు. కొద్ది రోజులు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. తాజాగా రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్గా తెరకెక్కుతున్న చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ అనే యాష్ట్యాగ్ ఓ టీజర్ విడుదల చేశారు.
డివివి ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో టీజర్ ను రిలీజ్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ అనే లోగో తో రిలీజ్ అయిన ఈ టీజర్ లోని మూడు ఆర్లు రాజమౌళి, రామ్చరణ్, రామారావు (ఎన్టీఆర్)ల పేర్లు ప్రతిబింభించేలా డిజైన్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ అనేది టైటిల్ కాదు కేవలం ఈ మెగా కలయికకు ప్రతీకగా ఈ లోగోను రిలీజ్ చేసినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఏది ఏమైనా జక్కన్ననుంచి అఫిషియల్ ప్రకటనైతే వచ్చింది.