- మళ్లీ కలుసుకున్న 1980 తారలు
- మహాబలిపురంలో సందడి
సినీ పరిశ్రమలో 1980 కాలం నాటి నటీనటుల శైలే వేరు. వారు అప్పట్లో వారంతా నటించిన సినిమాల బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో వారి కాలం మరువలేనిది. ఆ కాలంలో తెలుగు తారలు చిరంజీవి, వెంకటేశ్ సినిమాలు మంచి విజయాలు సాధించారు. వారితో కలిసి నటించిన హీరోయిన్లకు క్రేజే క్రేజీ. చిరంజీవి, వెంకటేశ్ సరసన రాధిక, సుహాసిని, జయసుధ, మీనా, రమ్యకృష్ణ, రేవతి, శోభన, కుష్బూ తదితర తారలు అప్పుడు సినిమాల్లో అలరించారు. ఇప్పుడు వారందరూ కలిసి ఒక్కచోటకు చేరారు. ‘80’s సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్’ పేరుతో వేడుకను ఈసారి కర్నాటకలోని మహాబలిపురంలో కలుసుకున్నారు. వీరు ఈ విధంగా కలుసుకోవడం ఎనిమిదోసారి సారి.
ఈ కార్యక్రమంలో అందరూ ఒకే రంగు గల వస్ర్తధారణ వేసుకున్నారు. మొత్తం 22 మంది సినీతారలు సందడి చేశారు. అందరూ వంగపువ్వు రంగు దుస్తులు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ర్యాంప్ వాక్ కూడా నిర్వహించారని తెలుస్తోంది. నటీమణులతోపాటు నటులు కూడా పాల్గొన్నారని టాక్. మొత్తం రెండు రోజులు వీరు మహాబలిపురంలో సందడి చేశారు. ఈ ముచ్చటను సీనియర్ నటి రాధ ‘80’s స్నేహితులతో లవ్లీ వీకెండ్’ అంటూ రాధిక ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో సినీ తారలు చిరంజీవి, వెంకటేశ్, సురేశ్, భానుచందర్, శరత్కుమార్, నరేశ్, రెహమాన్, జయసుధ, రాధిక, శోభన, సుహాసిని, ఖుష్బూ, రమ్యకృష్ణ, సుమలత, నదియ, రాధ, లిజీ, రేవతి, నదియా తదితరులు పాల్గొన్నారు.