వాగ్వాదాలు దాటుకొని వంద క్లబ్లోకి
వాయిదాలు.. వివాదాలు… దాడులు.. అడ్డంకులు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆటంకాలు.. దాటుకుని ఎట్టకేలకు థియేటర్లలోకి ‘పద్మావత్’ సినిమా విడుదలయ్యింది. విడుదలైన నాటి నుంచి ఈ సినిమా అందరీ ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా విమర్శకులు ప్రశంసలు కూడా అందుకుంటున్నాయి. బాహుబలికి మించిన సినిమా అని పేర్కొంటున్నాయి. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వానికి వహ్ అని అంటున్నారు. దీపిక పదుకొణె, షాహిద్కపూర్, రణవీర్సింగ్ అద్భుత నటనతో సినిమా సూపర్హిట్గా దూసుకెళ్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపిస్తోంది. ఈ సినిమా రూ.వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది.
‘పద్మావత్’ చిత్రం రూ.వంద కోట్ల క్లబ్లో చేరిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విటర్లో ప్రకటించాడు. గణతంత్ర దినోత్సవం, శుక్ర, శనివారాలు సెలవులు కావడంతో సినిమా కలెక్షన్లు అమాంతం పెరిగిపోయింది. ప్రీమియర్ షోలు, బుధవారం కలెక్షన్లు రూ.5 కోట్లు వచ్చాయి. గురువారం రూ.19 కోట్లు, శుక్రవారం రూ.32 కోట్లు, శనివారం రూ.27 కోట్లు వెరసి భారతీయ బాక్సాఫీస్ వద్ద మొత్తం ఇప్పటివరకు రూ.83 కోట్లు వసూళ్లు చేసింది. ఆదివారం, సోమవారంతో రూ.100 కోట్ల క్లబ్లోకి చేరింది.
పద్మావత్ సినిమా వివాదాస్పద అంశాలను ముట్టకుండా సినిమా డ్రామాతోనే తెరకెక్కించడంతో ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. చరిత్రను వక్రీకరించకుండా, చరిత్ర తెలియని వారికి కూడా సులభంగా చెబుతూ సినిమాలో భావోద్వేగాలకు కీలక పాత్ర పోషించాయి.