సినిమా రిలీజ్ కాకముందే అనేక వివాదాస్పదాలు మూటగట్టుకున్న సినిమా పద్మావత్. ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రంగం సిద్దమయ్యింది. సినిమా విడుదలను కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించడంతో చిత్ర బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్వీర్సింగ్, షాహిద్ కపూర్, దీపికా పదుకునె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. రాజ్పుత్ల ఖడ్గానికి ఉన్న శక్తి రాజ్పుత్ గాజులకు కూడా ఉంటుందని దీపికా అనే డైలాగ్ అదిరిపోయింది. ‘పద్మావత్’ చిత్రం బాగుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కితాబిచ్చారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో కలిసి ఆయన సినిమా వీక్షించారు. ఈ విధంగా సినిమా అందరీ ప్రశంసలు అందుకుంటోంది.
ఈ సినిమాను ‘పద్మావతి’ సినిమా ‘పద్మావత్’గా విడుదల చేస్తున్నారు. జనవరి 25వ తేదీన హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇటీవల సీబీఎఫ్సీ పలు మార్పులు చేసి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది.