Sunday, April 28, 2024
- Advertisement -

గీత గోవిందం ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు..

- Advertisement -

పరశురామ్ పేరు వినగానే ‘గీత గోవిందం’ సినిమా గుర్తుకువస్తుంది. అందమైన ఈ ప్రేమకథాంశం యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. వసూళ్ల ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డులు సృష్టించింది. దర్శకుడిగా పరశురామ్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

పరశురామ్ డైరెక్స‌న్‌లో మ‌రో సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. త్వ‌ర‌లోనె అభిమానుల కోరిక నెర‌వేర‌బోతోంది. ఆయన తదుపరి సినిమా మహేశ్ బాబుతో వుండనుందనేది తాజా సమాచారం. ఇటీవల మహేశ్ బాబును కలిసిన ఆయన, తాను సిద్ధం చేసిన కథను వినిపించాడట. కథ కొత్తగా .. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పిన మహేశ్ బాబు, పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకురమ్మని చెప్పాడట. అనిల్ రావిపూడి సినిమా తరువాత మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లేది పరశురామ్ తోనేనని అంటున్నారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో వుండనుందని సమాచారం. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా రేపు 9న విడుద‌ల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -