అప్పటి దాకా సైలెంట్ గా ఉన్న దర్శకుడు పరశురాం ఉన్నట్టుండి ‘గీతగోవిందం’ సినిమాతో సెన్సేషనల్ హిట్ ను అందుకున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇంత మంచి హిట్ సినిమా అందించినప్పటికీ దర్శకుడు పరశురాం ఇంకా తన తదుపరి సినిమా గురించి అప్డేట్ ఇవ్వకపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకుముందు మహేష్ బాబు పరశురాం తో ఒక సినిమా చేయాలని అనుకున్నారని వార్తలు బయటకు వచ్చాయి.
కానీ ఆ సినిమా కాస్త వర్క్ అవుట్ అవ్వలేదు. మరోవైపు పరుశురాం త్వరలో అల్లు అర్జున్ సినిమాకి దర్శకత్వం వహించనున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి కానీ వాటిల్లో కూడా నిజం లేదు.
అయితే గత కొన్ని రోజులుగా పరశురామ్ మళ్లీ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తోనే ఇంకొక సినిమా చేయబోతున్నాడు అంటూ సమాచారం అందుతోంది. ఈ మధ్యనే పరశురాం విజయ్ దేవరకొండ కలిసి తన దగ్గర ఉన్న ‘భరోసా’ అనే సినిమా కథ వినిపించారని తెలుస్తోంది. ఒకవేళ విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పరశురాం త్వరలోనే ఈ సినిమాని మొదలు పెట్టనున్నారని సమాచారం. మరోవైపు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం.