సంభాషణల రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎంతటి చాణక్యుడో మనకు తెలిసిందే. రచణల పరంగానే కాకుండా.. మాటకారుడిగాను శభాష్ అనిపించుకున్న వ్యక్తి. అలాంటి రచయితకు ఇప్పుడు చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. ఉన్నది కాస్త సైరా నరశింహారెడ్డినే. అది కూడా ఎప్పుడో 7,8 ఏళ్ల క్రితం రాసుకున్న సినిమా. ఈ మధ్యకాలంలో చేతిలో చెప్పుకోదగ్గ చిత్రం లేదు. దీంతో తనని తాను ప్రమోట్ చేసుకోవడం కోసమని ..మహేష్ పై పడపోయాడు.
మహేష్ ను చత్రపతి పాత్రలో చూడాలనుకుంటున్నాని… ఆ రోల్ కు ప్రిన్స్ మాత్రమే సెట్ అవుతాడన్నట్లుగా ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీనికి కారణంగా ప్రిన్స్ తండ్రి కృష్నగారి పురాణ కాలక్షేపాలు వల్లె వేశాడు. అల్లూరి సీతారామరాజు కృష్ణగారికి ఎంతమంచి పేరు తెచ్చిపెట్టిందో అంతే స్థాయిలో ..మహేష్ తో చత్రపతి చిత్రం చేస్తే.. అదే పేరు రావడం ఖాయమని పరుచూరి వారు చెబుతున్నారు.
అంతా బాగానే ఉంది కాని.. ఫుల్ లెన్త్ డైలాగ్స్ విషయంలో మహేష్ ఆ తరహాపాత్రలకు సెట్ అవ్వడనే అభిప్రాయముంది. ఎందుకంటే ప్రిన్స్ చెప్పే మాటలన్నీ పొడిపొడి మాటలే. అవే తనకు వర్కువుట్ అవుతాయని ప్రిన్స్ కు తెలుసు. తాను ఏ పాత్రలకు సెట్ అవుతానో తెలుసు కాబట్టే… మహేష్ పరుచూరి చెప్పిన మాటలను సీరియస్ గా తీసుకుని ముందుకు వేయడంటున్నారు సినీ జనాలు. బహుశా… పరుచూరి బ్రదర్స్ చత్రపతిపై ఓ కథను సిద్ధం చేసి..ఇలాంటి డైలాగ్ ను బయటకు వదిలారనే రూమర్ రౌండ్లు కొడుతుంది.