అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 4న విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో బన్నీ ఆర్మీ జవాన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచియం అవుతున్నాడు.బన్నీకి జంటగా అను ఇమ్మానుయేల్ చేస్తుంది.ఇటీవల ఆడియో వేడుకను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర గల మిలట్రీ మాధవరంలో ఆర్మీ జవాన్ల కుటుంబాల మధ్య నిర్వహించారు. తాజాగా ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ను ఈనెల 29న హైదరాబాద్లోని గచ్చిబౌలిలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నారు నిర్మాతలు.
‘నా పేరు సూర్య’ ప్రి రిలీజ్ ఈవెంట్కు బాహుబలి స్టార్ ప్రభాస్ను ఆహ్వానించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఫంక్షన్కు పవన్ కూడా వస్తున్నారని సమాచారం.దీనిని సీక్రెట్గా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.గత కొంతకాలంగా పవన్కు దూరంగా ఉంటున్న బన్నీ మొన్న జరిగిన వివాదంలో పవన్కు సపోర్టుగా నిలిచాడు.దీంతో వీరి మధ్య గొడవలు సర్దుమణిగినట్లే.అయితే పవన్ ఈ ఫంక్షన్కు రావడం అనుమానమే. ఈ వేడుకకు చరణ్ వస్తున్న సంగతి తెలిసందే.ఇది కనుక నిజం అయితే ఒకే వేదికపై పవన్,ప్రభాస్,రాంచరణ్, అల్లు అర్జున్ చూడవచ్చు.