Thursday, May 2, 2024
- Advertisement -

ఈ టీవీ వేడుకల్లో పాలు పంచుకొన్న పవన్ కల్యాణ్..!

- Advertisement -

సాధారణంగా పవర్ స్టార్ వపన్ కల్యాణ్ వేడుకలకు దూరంగా నే ఉంటాడు. తన సినిమా ఆడియో విడుదల వేడుకలు ఆర్బాటంగా చేయడానికి కూడా పవన్ ఒప్పుకోడు. ఒక్కోసారి తన ఫ్యాన్స్ అయిన వారు రూపొందించిన సినిమాల ఆడియోలను విడుదల చేయడానికి మాత్రం ఆయన వెళుతుంటారు.

వారు సెంటిమెంటల్ గా ఫీలై రమ్మని అడిగితే పవన్ కాదనక వెళుతుంటాడు.

మరి ఇలాంటి పవర్ స్టార్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రోగ్రామ్ లో భాగస్వామి అయ్యాడు. అదే ఈటీవీ 20 సంవత్సరాల వేడుక! ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ కార్యక్రమానికి పవన్ హాజరయినట్టుగా తెలుస్తోంది. ఈటీవీ అధినేత రామోజీరావు పాల్గొనగా చాలా గ్రాండ్ గా జరిన ఈ కార్యక్రమంలో పవన్ పాలు పంచుకొన్నాడు. ఈ చానల్ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగినట్టుగా తెలుస్తోంది.

ఈ కార్యక్రమం ఇంకా టీవీలో ప్రసారం కాలేదు. త్వరలోనే ఇది ప్రసారం అయ్యే అవకాశం ఉంది. పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని లీక్ చేసింది సీనియర్ నటుడు నరేష్. తన ట్విటర్ అకౌంట్లో నరేష్ ఒక ఫోటోను ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలిపాడు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉన్న పవన్. .తెలుగుదేశం పార్టీకే సన్నిహితమైన రామోజీ రావుకు సంబంధించిన టీవీ చానల్ కు సంబంధించిన వేడుకలో పాల్గొనడం ఆసక్తికరమైన అంశమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -