Friday, May 17, 2024
- Advertisement -

రామ్ చరణ్ కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

- Advertisement -
Pawan kalyan as Chief Guest for Dhruva audio

తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ సినిమాని తెలుగులో ధృవ గా రీమేక్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సూరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కావోచ్చింది. ఇక ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో విలన్ గా ఒకప్పటి హీరో అరవింద్ స్వామి నటిస్తుడటం విశేషం. ఇక వచ్చే నెల 20న ధృవ ఆడియో వేడుక మెగా ఫ్యాన్స్ అధ్వర్యంలో గ్రాండ్ గా చేయనున్నారు. కాగా ఆ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా హాజరు కానున్నాడట. అబ్బాయ్ రాంచరణ్ తేజ్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇద్దరు మెగా హీరోలను ఒకే స్టేజ్ మీద చూసే అవకాశం వస్తుందని అభిమానులు సంతోష పడుతున్నారు. ప్రస్తుతం పవన్ కాటమ రాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ కాటమ రాయుడు సినిమాకి డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related

  1. శివ బాలాజీ కోసం పవన్ ఏం చేసాడో తెలుసా?
  2. కొరటాల డైరెక్షన్లో ముఖ్యమంత్రిగా పవన్ సినిమా!
  3. చరణ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే!
  4. హీరో రామ్ కి బుద్దొచ్చింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -