Friday, April 19, 2024
- Advertisement -

హుద్ హుద్ కాదు.. ‘భీమ్లా’ తుఫాన్.. ఇప్పట్లో తీరం దాటేలా లేదు..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాడు. రికార్డులను వరుసబెట్టి ఊచ కోత కోస్తున్నాడు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.
అంతకుముందున్న ఫాస్టెస్ట్ టీజర్ రికార్డులను తిరగరాస్తోంది.

గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే 9.2 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. 24 గంటల్లోనే ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం ఇదే మొదటిసారి. అలాగే ఈ గ్లింప్స్ కు ఇప్పటిదాకా 750 కే లైక్స్ వచ్చాయి. ఇది కూడా ఓ రికార్డే. పవన్ కళ్యాణ్ వీరావేశం ప్రదర్శిస్తూ చెప్పిన డైలాగ్ ఆయన అభిమానులనే కాదు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటోంది.

గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ యాక్షన్ మోడ్ లో పవన్ కళ్యాణ్ ని చూడాలని అభిమానులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారు ఆశించిన స్థాయిలో భీమ్లా నాయక్ గ్లింప్స్ ఉండడంతో ఈ వీడియోను చూసిన వారే మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అందుకే యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

జస్ట్ గ్లింప్స్ కే రికార్డులు బద్దలు అవుతున్నాయని.. సినిమా విడుదలైతే ఇక బీభత్సమేనని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా ఈ సినిమాలోని పాటలు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి. భీమ్లా నాయక్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Also Read: ఎవరూ ఊహించని కాంబినేషన్.. పాన్ ఇండియా హీరోల మల్టీ స్టారర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -