Tuesday, May 7, 2024
- Advertisement -

రేణు దేశాయ్‌కి కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్‌

- Advertisement -

జ‌న‌సేన అధినేత ,న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆయ‌న మాజీ భార్య రేణు దేశాయ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.ప‌వ‌న్ నేనుండ‌గానే మ‌రో మ‌హిళ‌తో ప‌వ‌న్ ఎఫైర్ పెట్టుకుని బిడ్డ‌కు జ‌న్మినిచ్చాడని,నేను విడాకులు అడ‌గ‌లేద‌ని ప‌వ‌నే విడాకులు కావాల‌ని అడిగార‌ని ఓ ఇంట‌ర్య్వూలో చెప్పారు రేణు దేశాయ్‌.అయితే తాజాగా ప‌వ‌న్ తన మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన కామెంట్స్‌పై స్పందించారు. నేను స్త్రీలకి ఎంత గౌరవమిస్తానో మా అక్కచెల్లెల్లకు తెలుసు.

చాలా మంది నన్ను అవమానించినా కానీ, రకరకాలుగా బాధ పెట్టినా కానీ నేను గుండెల్లో పెట్టుకున్నా.. ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నన్ను దెబ్బ కొట్టే వాళ్లను కూడా, నన్ను చీదరించుకున్నా ఎంత క్షోభకు గురిచేసినా వాళ్ల గురించి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే, నేను మాట్లాడలేక కాదు, వాళ్ల గౌరవాన్ని రోడ్డు మీదకు లాగడం నాకు ఇష్టం లేదు. నా గురించి మాట్లాడే వాళ్లను నేను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ని తెలిపారు ప‌వ‌న్‌.వైజాగ్ యాత్రలో ఉన్న ప‌వ‌న్‌ను కొంద‌రు జ‌న‌సేన మ‌హిళ కార్య‌క‌ర్త‌లు సోయ‌వారం క‌లిశారు.జనసేన పార్టీ మహిళలకు ఏం చేయబోతోంది.

మమల్ని సభలకు ఎందుకు రానివ్వట్లేదని వారు ప‌వ‌న్‌ని ప్ర‌శ్నించారు.అక్కడ జనం ఎక్కువ వస్తారు మీరు చాలా ఇబ్బంది పడతారు,మహిళలు కోసం ఒక ఆత్మీయ సంభాషణ పెడదాం,అక్క‌డ అంద‌రం క‌లిసి మాట్లాడుకుందాం అని ప‌వ‌న్ జ‌న‌సేన మ‌హిళ కార్య‌క‌ర్త‌లతో చెప్పిన‌ట్లు స‌మాచారం.ఏది ఏమైనా ప‌వ‌న్ త‌న మాజీ భార్య‌కు భ‌లే కౌంట‌ర్ ఇచ్చాడ‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -