- Advertisement -
వకీల్ సాబ్, భీమ్లానాయక్ వంటి హిట్స్ తర్వాత ప్రేక్షకులను అలరించబోతున్న పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లు. 17వ శతాబ్దంలోని మొఘలుల కాలం నాటి కథతో డైరెక్టర్ క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 200 కోట్లతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్కు ఇది తొలి పాన్ ఇండియా మూవీ.
బాహుబలి తర్వాత యుద్ధ సన్నివేశాలతో హరిహర వీరమల్లు అలరించబోతోంది. ఏ.ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తుండగా…బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. హరిహర వీరమల్లును వచ్చే సంక్రాంతి సీజన్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్తో భవదీయుడు భగత్సింగ్ మూవీని పవన్ కల్యాణ్ చేయనున్నారు.