మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ అంటేనే ఆ క్రేజ్ వేరు. అతడు, ఖలేజా తర్వాత ముచ్చట మూడోసారి ఈ ఇద్దరి కాంబోలో మరో మూవీ సిద్ధమవుతోంది. రాధకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ పూజా హెగ్డే. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్స్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను మల్టీ స్టారర్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు నేచురుల్ స్టార్ నానిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకు నాని సైతం వెంటనే ఒప్పుకున్నాడట. నానితో పాటు మలయాళ నటులు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో ఏ చిన్న పాత్రనైనా పెద్ద స్టార్స్ తో చేయించడం రివాజు.
అందుకే మాటల మాంత్రికుడి సినిమాలో ఏ రోల్ అయినా చేసేందుకు పెద్ద స్టార్స్ కూడా ముందుకు వస్తుంటారు. మరోవైపు మహేశ్ బాబు నటిస్తున్న 28వ చిత్రం ఇది.
డ్రీమ్ కారు సొంతం చేసుకున్న విశ్వక్ సేన్