బాహుబలి సినిమా ఎలాంటి విజయం సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సంబంధం లేదని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీ స్టోరీను రాసిని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్టోరీ అంత తన సొంతం అని చెప్పారు. కష్టపడి స్టోరీ రాసి మూవీని తీశాం అని చెప్పారు.
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఒక ఇన్స్పిరేషన్, పవన్ వల్ల చాలా మంది చాలా ఇన్స్పైర్ అయ్యారు. అయితే సహజంగా సామాన్యులు ఇన్స్పైర్ అయితే పర్వాలేదు కానీ సాక్షాత్తూ బాలీవుడ్ కు కధలు అందించి, దర్శకత్వం వహించిన ఒక ప్రఖ్యాత రచయిత ఇన్స్పైర్ కావడం నిజంగా గొప్ప విశేషం. ఇంతకీ విషయం ఏమిటి అంటే, ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కధా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బాహుబలి సినిమా ఇంటర్వెల్ సీన్ పవన్ కల్యాణ్ ఇన్స్పిరేషన్ తో రాశాను అని తెలిపాడు. ఈ నెపథ్యంలో అసలు ఆ సీన్ ఏంటి..? ఆది పవన్ తో ఎలా లింక్ అయ్యింది అని అడగగా.. మాట్లాడుతూ, స్క్రీన్ మీద మహీష్మతి ఊపిరి తీసుకో అంటూ విశ్రాంతికి బదులుగా వచ్చిన మాటల గురించి వివరిస్తూ “బాహుబలి2 ఇంటర్వెల్ సీన్ ఎలా ఉండాలన్న విషయం మీద చాలానే ఆలోచించాం.
భళ్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతుంది. కానీ సంతృప్తిగా ఉండలేడు. బాహుబలికి జనం పడుతున్న నీరాజనాలు చూసి ఆసూయతో రగిలిపోతాడు. ఇదీ మేం అనుకున్నది. దాన్ని ఎలా చూపించాలా? అని సతమతమవుతున్న క్రమంలో టీవీలో ఏదో ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. పవర్ స్టార్ అక్కడ లేడు.. కానీ పవర్ స్టార్ పవర్ స్టార్ అనే పేరు మాత్రం వినిపిస్తోంది. ఐదునిమిషాల పాటు ఎవరేం మాట్లాడినా వినిపించటం లేదు. ఆ టైంలో ఎవరున్నా… చివరకు హీరో ఎవరైనా సరే.. అసూయ పడాల్సిందే. ఇదేదో బాగుంది కదా అని అనుకున్నాం. వెంటనే ఆ ఇంటర్వెల్ సీన్ రాశాను అంటూ పవన్ తనను ఇన్స్పైర్ చేసిన సంగతిని మన విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
{youtube}od8br_oBo0k{/youtube}
Related