రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రం బ్లాక్బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ని నిర్వహించింది. ఈ వేదికకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండేళ్ల క్రితం ‘బాహుబలి’కి చిత్రపరిశ్రమ అంతా ఎలా అండగా నిలబడిందో, ఇప్పుడు ‘రంగస్థలం’కి అలా నిలబడాలని సూచించారు.
ఉత్తర, దక్షిణ భారత చలన చిత్రపరిశ్రమలు రెండూ కలసి, లాబీయింగ్ చేసి ‘రంగస్థలం’ చిత్రాన్ని ఆస్కార్ కోసం పంపాలని, లేకపోతే ఈ చిత్రానికి ద్రోహం చేసిన వాళ్లమవుతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చరణ్ నాకు తమ్ముడిలాంటివాడు. అన్నయ్య చిరంజీవి తనకు తండ్రిలాంటి వారని వదిన తల్లి లాంటిదని, చరణ్ మరిన్ని విజయాలు సాధించాలి తాను కోరుకుంటున్నాని పవన్ చెప్పారు.ఈ కార్యక్రమంలోరంగస్థలం చిత్ర యూనిట్ మొత్తం పొల్గోంది.