జనసేన అధినేత పవన్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టారు. పార్టీ స్థాపించిన తర్వాత ఆయన పార్ట్టైమ్ రాజకీయాలు చేస్తున్నారని అన్ని వర్గాలనుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు సినిమాలకు గుడ్బాయ్ చెప్పి తన సమయం అంతా పూర్తిగా రాజకీయాలకు కేటాయించారు జనసేనుడు.
అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో నటనకు పూర్తిగా దూరమయ్యారు. పూర్తి రాజకీయాలకే సమయం కేటాయించటంతో ఇక వెండితెర మీద కనిపించటం అసాధ్యం అన్న ప్రచారం జరిగింది. అయితే పవన్ మరో సారి మేకప్ వేసుకొనేదానికి సిద్ధమయ్యారనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.
పవన్ త్వరలో ఓ సినిమాలో నటించేందుకు సూచన ప్రాయంగా ఒప్పుకున్నారంట. పవన్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలో హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. పవన్తో గోపాల గోపాల కాటమరాయుడు సినిమాలను తెరకెక్కించిన డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం పవన్ సంప్రదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మేనల్లుడి కోసమనే కాకుండా దర్శకుడు డాలీ, నిర్మాత రామ్ తళ్లూరిలతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో నటించేందుకు పవన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ గాని, పవన్ సన్నిహితులు గాని ఎలాంటి ప్రకటనా చేయలేదు.