భారీ అంచనాల మధ్య ప్రారంభం అయింది తెలుగు బిగ్బాస్ రెండో సీజన్.నాని యాంకర్గా వ్యవహరిస్తున్న బిగ్బాస్ రెండవ సీజన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.కామన్ మ్యాన్స్ని ఇద్దరిని ఎలిమినేట్ చేయడం ద్వారా ఇప్పటికే విమర్శల పాలైంది బిగ్బాస్.ఇక వారం ఎలిమినేషన్లో భాగంగా యాంకర్ శ్యామలా ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే.అయితే శ్యామలా ఎలిమినేషన్ చేయడంపై బిగ్బాస్ను అందరు తప్పు పడుతున్నారు.
ఈ వారం ఎలిమినేషన్లో మొత్తం ఎనిమిది మంది ఉండగా అందరు సేఫ్ అయి చివరికి ముగ్గురు మిగిలారు.యాంకర్ దీప్తి,,నందిని,శ్యామలా.ఈ ముగ్గురికి ఓట్లు తక్కువుగా రావడంతో ఎలిమినేషన్లో ఈ ముగ్గురు ఉన్నారు.స్పెషల్ పవర్స్ పేరిట,కౌశిల్,తేజస్వికి ఈ ముగ్గురులో ఇద్దరిని హోస్లో ఉండలనేకునే వారిని సెలెక్ట్ చేయమన్నారు.కౌశిల్ నందినిని ఎంపిక చేయగా,తేజస్వి దీప్తిని ఎంపిక చేసింది.దీంతో యాంకర్ శ్యామలా షో నుండి ఎలిమినేట్ అయింది.అయితే ఈ ఎంపిక విధానాన్ని అందరు తప్పు పడుతున్నారు.మీకు మీరే ఎంపిక చేసుకుంటే ప్రజలను ఎందుకు ఓట్లు అడగడం అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ముగ్గురికి ఓట్లు సమానంగా రావు కనుక తక్కువ ఓట్లు వచ్చిన వారిని బయటికి పంపించకుండ, ఇలా షోలోని వ్యక్తలను అడిగి ఎలిమినేట్ చేయడం అనేది దారుణం అని కొందరి భావన.
షోలోని వ్యక్తులను అడిగితే వారు తమకు నచ్చిన వ్యక్తులనే ఎంపిక చేసుకుంటారని కూడా బిగ్బాస్కు తెలియకపోవడం ఇక్కడ మరో విశేషం.ఇలా జరిగితే ఓట్లు పడిన వ్యక్తికి అన్యాయం జరిగినట్టే కదా!శ్యామాలా ఎటిమినేట్ అవడాన్ని అందరు తప్పుపడుతున్నారు.ఇలాగే ప్రతివారం షోలోని వ్యక్తులని అడిగి ఎలిమినేట్ చేసుకోండి మమ్మల్ని ఎందుకు పిచ్చోళ్లోని చేస్తున్నారని ప్రజలు బిగ్బాస్పై మండిపడుతున్నారు.శ్యామలా షో నుండి బయటికి వస్తుంటే హోస్మెట్స్తో పాటు బయటి ఉన్న ప్రజలను కూడా కంటతడి పెట్టించింది.