- Advertisement -
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ నవ్విందని ఓ కేసు నమోదైంది.కత్రినా, సల్మాన్ జంటగా నటించిన చిత్రం ‘టైగర్ జిందా హై’. డిసెంబర్లో విడుదలైన విషయం అందరికి తెలిసందే.ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా కత్రినా, సల్మాన్ ఓ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోలో కొందరు వ్యక్తులు సరదాగా మతపరమైన వ్యాఖ్యలు చేశారు.
అక్కడే ఉన్న సల్మాన్, కత్రినా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించాల్సిందిపోయి పగలబడి నవ్వారట. దాంతో దిల్లీ కమిషన్ ఫర్ కరమ్చారీస్ సంస్థ మాజీ ఛైర్మన్ హర్ణమ్ సింగ్ కత్రినా, సల్మాన్పై కేసులు నమోదు చేశారు.డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం రూ.300కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.