ఘటోత్కచుడి వివాహ భోజనంబు పాడిన పాట
మాయాబజార్ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో అజరామరమైన సినిమా. వెండితెర ఆణిముత్యం. ఆ కాలంలోనే టెక్నాలజీని ఉపయోగించుకొని మాయలు, మర్మాలు చేసి సినిమా తెరకెక్కించారు. ఆ సినిమాలో మహామహానటులందరూ నటించి కీర్తి గడించారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర్రావు, సావిత్రి, జమున, ఎస్వీఆర్ తదితరులు సినిమాలో మెరిశారు.
ఆ సినిమాలో ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్ నటన అద్భుత హ. ఆయనకు ఆకలై భోజనం చేసే సన్నివేశమైతే ఆ చిత్రానికి హైలెట్. ఆ సందర్భంగా ఎస్వీఆర్ పాడిన పాట.. నటన ఆయన తప్ప ఎవరూ చేయలేరనంతగా చేసి చూపించారు. ఇప్పుడు ఆ పాటను.. ఓ పోలండ్ బుడ్డోడు పాడి అద్భుతహ అనిపించుకుంటున్నాడు.
వచ్చి రాని మాటలతో పాడే ఆ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. పోలాండ్కు చెందిన పిల్లాడు జిబిగ్జ్. ఈ పిల్లాడు ఇంతకుముందు అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాలోని పాటను పాడి మెప్పించాడు. మెరిసే మెరిసే అంటూ పాడి నాగార్జునను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. నాగార్జున పిల్లాడిని అభినందించకుండా ఉండలేకపోయాడు. వెంటనే రీట్వీట్ చేశాడు. ఈ విధంగా ఆ పిల్లాడు పాటల్లో మెరిసిపోతున్నాడు. ఇప్పుడు డైలాగ్ కూడా అదరగొట్టాడు.ఈ పిల్లాడికి బుల్లి ప్రపంచం కూడా ఉంది. అతడికి వేల మంది ఫాలో అవుతున్నారు. భారతదేశం అంటే ప్రాణమంట. తెలుగు, హిందీ సినిమాలు తరచూ ఫాలో అవుతున్నాడు.
https://www.facebook.com/natasaarvabhouma/videos/699866736874168/?fref=mentions
That's Awesome 😊👍@Vikram_K_Kumar @kalyanipriyann @AkhilAkkineni8 pic.twitter.com/fevpLUOIzc
— anuprubens (@anuprubens) December 9, 2017