ముకుందా సినిమాతో తెలుగు తెరకు పరిచియమైంది హీరోయిన్ పూజా హెగ్డె. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఈ సినిమా తరువాత వరస ఆఫర్లతో బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం పూజా హెగ్డె ఎన్టీఆర్ అరవింద సమేత, మహేశ్ బాబు మహర్షి, అలానే బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ తదుపరి సినిమాకు కూడా సైన్ చేసింది పూజా హెగ్డె.
అయితే ఇటీవల హరికృష్ణ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ‘అరవింద సమేత’ సినిమా షూటింగ్ ఐదు రోజుల పాటు వాయిదా పడింది. దీంతో పూజా హెగ్డె కాల్ షీట్స్ అన్ని తారుమారు అయ్యాయి. దీంతో ఆ సినిమాకు డేట్స్ కేటాయించిన పూజా తన కాల్షీట్స్ మళ్లీ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ పక్క ఇక్కడ షూటింగ్ లో పాల్గొంటూనే.. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరుగుతోన్న ‘హౌస్ ఫుల్4’ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంటోంది. ఇక మహేశ్ సినిమా డేట్స్లో కూడా మార్పులు చేసినట్లు సమాచారం.