పూనమ్ కౌర్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచియమైంది.చక్కటి అందంతో ఉన్నప్పటికి ఎందుకనో ఈమెకు అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు.దీంతో తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది.ఈ మధ్య పవన్ కల్యాణ్పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ నిర్మాత తనను తప్పుడు ఉద్దేశంతో ఆఫీస్ కు పిలిపించినట్లు చెప్పుకొచ్చింది.ఆ నిర్మాత పేరు మాత్రం వెల్లడించలేదు. ఓ పెద్ద నిర్మాత మా ఇంటికి వచ్చాడు. నువ్ చాలా బాగా నటిస్తావు.. నీకు పెద్ద హీరోల సరసన అవకాశం ఇప్పిస్తాను. ఒకసారి కలువు అని చెప్పారు.
కాని నాకు అనుమానం వచ్చి మా అమ్మగారిని తోడు తీసుకువెళ్లడంతో ఆ నిర్మాతకు కోపం వచ్చి నాతో సరిగ్గా మాట్లాడలేదు.ఇది నా ఒక్కదాని విషయంలో కాదు చాలామంది హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే హీరోయిన్స్ ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండలని హితవు పలికింది పూనమ్ కౌర్. పూనమ్ ప్రస్తుతం ఓ టీవి సీరియల్లో కూడా నటిస్తుంది.ఈటీవిలో ప్రసారమయ్యే స్వర్ణ ఖడ్గం సీరియల్లో హీరోయిన్గా చేస్తుంది.