విద్యాబాలన్.. ఈ భామకు బాలీవుడ్ లో ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఈమె ఏ సినిమా చేసిన అందులో మంచి కథనం ఉంటుంది. అయితే సంచలనాత్మక సినిమాల్లో నటించే విద్యాబాలన్ తన అధ్బుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుటుంది. విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్, కహానీ చిత్రాలు ప్రేక్షాకాదరణ పొందడమే కాకుండా ప్రశంసలను కూడా అందుకుంది. తాజాగా విద్యాబాలన్ మరో సంచలన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తన తాజా సినిమా ‘బేగం జాన్’లో ఆమె వ్యభిచార గృహ (బ్రోతల్) నిర్వాహకురాలి పాత్ర పోషిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఇటివలే రిలీజ్ చేశారు. ఇందులో బ్రోతల్ నిర్వాహకురాలి పాత్రలో లీనమైపోయిన ఆమె ఆహార్యం అదుర్స్ అనిపిస్తోంది. సినిమాపై భారీ అంచనాలు పెంచ్చేసింది.
బెంగాలీ డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. బెంగాలీలో ‘రాజ్ కహిని’ పేరిట శ్రీజిత్రూపొందించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. దేశ విభజన సమయంలో భారత్ పాకిస్థాన్ సరిహద్దు రేఖ వద్ద ఉన్న బ్రోతల్ హౌస్ ను నిర్వహించే పాత్రలో విద్య కనిపించనుంది. ఈ సినిమాలో గౌహార్ ఖాన్ పల్లవీ శార్దా వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది.
Related