ఎక్కడికైనా వెళ్లాలంటే సాధారణంగా కారులో వెళ్లే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సారి మెట్రోలో సామాన్యులతో కలిసి ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపర్చారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వకీల్ సాబ్ లో పవన్ కల్యాణ్ లాయర్ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే నల్లకోటు వేసుకుని హైదరాబాద్ మెట్రో రైలులో మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ఆయన ప్రయాణించారు. ఆయన వెంట నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. సాధారణ ప్రయాణికుల్లానే చెకింగ్ ప్రక్రియతో పాటు ఎంట్రీ విధానాలను వారు పాటించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో పవన్ మాస్కు ధరించారు.
మెట్రో ట్రైనులో ప్రయాణిస్తున్న ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారితో పవన్ మాటామంతి కలిపారు. ద్రాక్షారామానికి చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో పండిస్తోన్న పంటలు, ప్రస్తుతం ఎదురవుతోన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు చెప్పారు. మెట్రో ప్రయాణం తనకు మొదటి సారని రైతు చెప్పారు. దీంతో పవన్ కల్యాణ్ నవ్వుతూ తనకు కూడా మెట్రో ప్రయాణం తొలిసారేనని అన్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సైడ్ క్యారెక్టర్స్ నేను చేయలేను : హీరో తరుణ్
పవన్ ఆఫర్ ను తిరస్కరించిన త్రివిక్రమ్..!