Sunday, April 28, 2024
- Advertisement -

ప్రభాస్ టెంపుల్ రన్!

- Advertisement -

సలార్ సినిమాతో ఎట్టకేలకు హిట్ బాట పట్టాడు ప్రభాస్. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఫస్ట్ పార్ట్ దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాహుబలి తర్వాత ప్రభాస్ సలార్‌తో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టాడు. ఇక సలార్ హిట్ తర్వాత జోష్ మీదున్న ప్రభాస్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నాడు.

టెంపుల్ రన్ చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నాడు. సలార్ నిర్మాతలు హోంబేలె సంస్థ ప్రతినిధులతో కలిసి కర్ణాటకలోని మంగళూరు కాటెల్ గ్రామంలో ఉన్న శ్రీ దుర్గ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు అమ్మవారి పటం, ప్రసాదం ప్రభాస్ కి అందచేసి ఆశీర్వదించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ప్రభాస్ కళ్ళజోడు పెట్టుకొని, తలపై క్యాప్ పెట్టుకొని, మాస్క్ తో వైట్ హుడి, బ్లాక్ ప్యాంట్ వేసుకొని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ప్రభాస్…నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అలాగే సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో ఈ ఏడాది అలరించనున్నాడు ప్రభాస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -