ప్రభాస్ గురించి మాట్లాడాలంటే బాహుబలి ముందు బాహుబలి తరువాత అని విభజించి మాట్లడాలి.ఆ విధంగా బాహుబలి తరువాత ప్రభాస్ ఇమేజ్ ఇండియానే కాగా ప్రపంచం మొత్తం క్రేజ్ ఏర్పిడింది.బాహుబలి సినిమాలు ఆ రేంజ్లో హిట్టవ్వడానికి అసలు రీజన్ రాజమౌళి ప్రతిభాపాటవాలే అనడంలో డౌట్ ఏమీ లేదు. కానీ ఆ సినిమాలతో ప్రభాస్ మగువల మనసు దోచుకున్నాడనంలోనూ సందేహం అక్కర్లేదు. సౌత్, నార్త్ అనే తేడా లేదు ప్రభాస్ మేన్లీనెస్కి అమ్మాయిలంతా ఫిదా.
ప్రభాస్కి సంబంధించిన ఏ వీడియో అప్లోడ్ చేసినా, అతను ఫేస్బుక్లో ఏ పోస్ట్ పెట్టినా…వైరల్ అవుతోందిపుడు. అది అతనికున్న క్రేజ్. అంత క్రేజుంది కాబట్టే కరణ్ జోహార్ ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. కానీ ప్రభాస్ 20 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేయడంతో కరణ్ జోహార్ పారిపోయాడనే వార్త చక్కర్లు కొడుతుంది.
ఇంతకీ ప్రభాస్ అడిగిన దాంట్లో తప్పేముంది. తిప్పి తిప్పి కొడితే ఒక్క భాషలోనే (తెలుగులో) 100 కోట్ల షేర్ సంపాదించలేకపోతున్న కొందరు బడా హీరోలు 20 కోట్లపైనే పారితోషికం తీసుకుంటున్నపుడు మల్టీ లాంగ్వేజ్స్లో మార్కెట్ ఉన్న ప్రభాస్ 20 కోట్లు అడిగితే తప్పేంటట!రణబీర్ కపూర్ వంటి బాలీవుడ్ నటుడు రీసెంట్గా నాలుగు సినిమాలు విడుదల చేస్తే…అందులో ఒక్కటీ ఇండియాలో 100 కోట్ల రూపాయల వసూళ్ళు అందుకోలేదు. అలాంటి హీరోకి కరణ్ జోహార్ 30 కోట్ల పారితోషికం ఇచ్చాడు. ఆ లెక్కన చూస్తే ప్రభాస్ అడిగిన పారితోషికం ఎంత? 20 కోట్లు చాలా తక్కువ.