బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఒక్క సినిమాతోనే నేషనల్ లేవల్లో స్టార్ హీరోగా మారాడు ప్రభాస్. ఈ సినిమా తరువాత ప్రభాస్ సాహో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ప్రభాస్కు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకుందామని చేస్తోంది బీజేపీ పార్టీ. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృషంరాజు బీజేపీ పార్టీలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన ద్వారా ప్రభాస్ను రాజకీయాలలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుందట బీజేపీ పార్టీ. నరసాపురం లోక్సభ స్థానం నుంచి కృషంరాజు పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ ప్రచారానికి వస్తాడనే కృషంరాజుకు సీటు ఇచ్చిందట బీజేపీ పార్టీ.
ఇలా ప్రభాస్ చేత ప్రచారం చేయిస్తే కృషంరాజు ఈజీగానే గెలుస్తారని లెక్కలు వేస్తోంది బీజేపీ పార్టీ. ఇక ప్రభాస్ చేత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేయించాలనే ఆలోచనలో కూడా బీజేపీ ఉందని తెలుస్తోంది. 2019లో జరిగే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తోన్న బీజేపీ పార్టీ. దీని కోసం అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. అవసరం అయితే ప్రభాస్తో నేరుగా ప్రధాని నరేంద్ర మోదీనే మాట్లాడానికి రెడీ అయ్యారని సమాచారం. ఎట్టి పరిస్థితులలో ప్రభాస్ చేత ఎన్నికల ప్రచారం చేయించాలని చూస్తోంది. మరి సినిమాలు తప్ప మరోకటి తెలియని ప్రభాస్ తన పెదనాన్న తరుపున ఎన్నికల ప్రచారం చేస్తాడో లేదో చూడాలి.
- Advertisement -
బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రభాస్..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -