Saturday, April 20, 2024
- Advertisement -

ఆ సన్నివేశం చేసేప్పుడు ఇబ్బందులు పడ్డా: ప్రభాస్

- Advertisement -

ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్‌ లవ్‌స్టోరి “రాధేశ్యామ్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న సినిమా పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా “రాధేశ్యామ్” మూవీ ప్యాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.

ప్రభాస్‌ హీరోగా పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ తన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ ను మీరు నటించిన సినిమాల్లో ఏ స‌న్నివేశం కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డారు. అని అడగగా ప్ర‌భాస్ ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన “చక్రం” సినిమాలో ఓ సన్నివేశంలో అమ్మాయిలా నటించడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నాకు నచ్చకపోయినా ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ చాలా కచ్చితంగా వ్యవహరిస్తారు. దాంతో చేయ‌క త‌ప్ప‌లేదు. ఆ స‌న్నివేశంలో న‌టించేట‌ప్పుడు చెమ‌ట్లొచ్చేసేవి అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

Also read:క్రాక్ టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్ చూశారా.. ఎంత బాగుందో?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో “సలార్‌”అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అలాగే డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు.ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని
వైజయంతి మూవీస్ సంస్థ దాదాపు ఐదు వందల కోట్లు భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధమైంది.

Also read:30 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న సీరియల్ హీరో.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -