Thursday, April 25, 2024
- Advertisement -

సల్మాన్ ‘రాధే’ని ఫాలో అవుతున్న ప్రభాస్ “రాధేశ్యామ్”?

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా అన్ని రంగాల్లో ఎంతో కోలుకోలేని దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా సినిమా రంగంపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ కొట్టినదని చెప్పవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని సినిమాల షూటింగ్ వాయిదా పడగా, మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేకపోతున్నాయి.

ఇప్పటికే షూటింగ్‌లు పూర్తి చేసుకున్న కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. కానీ భారీ బడ్జెట్ చిత్రాల పరిస్థితి అది కాదు. ఈ చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేస్తే నిర్మాతలకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. అలాగని విడుదల చేయకపోయినా నష్టం జరుగుతుంది కనుక ఓటీటీలో పే ఫర్ వ్యూ విధానంలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి.

Also read:ఆ సినిమాల లిస్టులోకి చేరిపోయిన నాగ చైతన్య.. థాంక్యూ!

ఈ విధానంలోనే సల్మాన్ ఖాన్ ‘రాధే: ది మోస్ట్‌ ఆంటెడ్‌ భాయ్‌’ ధియేటర్లతో పాటు ఓటీటీల్లో పే పర్‌ వ్యూ విధానంలో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ బాటలో ప్రభాస్ “రాధేశ్యామ్” చిత్రం కూడా ఓటీటీలో పే పర్‌ వ్యూ విధానంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కింది. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 30 న విడుదల చేయాలని చిత్రబృందం భావించారు. అప్పటికి కరోనా పరిస్థితులు సద్దుమణిగితే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేస్తారనే విషయం గురించి చిత్ర బృందం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.

Also read:త్రివిక్రమ్-మహేష్ ముచ్చటగా మూడో సినిమా .. హిట్ పక్కా!

ఆక్సిజన్ కోసం లక్ష విరాళం ఇచ్చిన ప్రణీత సుభాష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -