Saturday, May 4, 2024
- Advertisement -

త్రివిక్రమ్-మహేష్ ముచ్చటగా మూడో సినిమా .. హిట్ పక్కా!

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడుగా వెలుగొందుతున్నాడు. ప్రిన్స్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత గీతగోవిందం మూవీ ఫేం పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న ఫ్యామిలీ మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ మూవీలో మహేశ్ సరసన బ్యూటీ క్వీన్ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల ప్రభావం ఈ సినిమా షూటింగ్ పై కూడా పడింది.

మహేష్ అభిమానులను చాలా కాలం నుంచి ఊరిస్తూ వస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రిన్స్ మహేష్ కాంబోలో రాబోతోన్న మూవీ పై తాజాగా వదిలిన ప్రోమో వీడియోతో అధికారికంగా ప్రకటించేశారు.ఈ వీడియోలోని బ్యాక్ గ్రౌండ్ సౌండ్ అదిరిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదల అవుతుందని సినిమా మేకర్స్ ప్రకటించారు.

Also read:ఆ సినిమా రీమేక్ చేస్తే.. బెల్లంకొండ బ్రదర్స్ పరువు పోతుంది..!

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇప్పటికే అతడు, ఖలేజా వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. మళ్లీ వీరి కాంబినేషన్ 11 సంవత్సరాల తర్వాత హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రిన్స్ మహేష్ బాబుకు ఇది 28వ సినిమా కావడం విశేషం.

Also read:లీకైన పుష్ప సినిమా స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాను కాపీ కొట్టాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -