యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం సాహో. బాహుబలి సక్సెస్తో ప్రభాస్కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో సాహోను కూడా బహు భాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అన్ని వర్గాల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సర్ప్రైజ్ ఇస్తున్నాం అంటూ ప్రభాస్ సోమవారం ఓ వీడియో మేసేజ్ రిలీజ్ చేశాడు.
ఈ సినిమా నుంచి ఈ రోజు ఒక సర్ ప్రైజ్ ఉంటుందని నిన్ననే ఒక వీడియో బైట్ ద్వారా ప్రభాస్ చెప్పాడు. అన్నట్టుగానే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు. అప్పటి నుంచి అభిమానులు ప్రభాస్ ఇచ్చే సర్ప్రైజ్ ఏంటా అని ఆసక్తిగా ఎదురుచూశారు. మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ సర్ప్రైజ్ను రివీల్ చేశాడు.సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించటంతో పాటు ఫస్ట్లుక్ను రిలీజ్ చేశాడు.
డిఫరెంట్ లుక్ తో .. చాలా తీక్షణమైన చూపులతో ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఎక్కువగా వున్నాయి.ఎంతోమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకోసం పనిచేస్తున్నారు.రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.