Sunday, May 5, 2024
- Advertisement -

ఊహలకు అందని రీతిలో సలార్!

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ మూవీ తెరకెకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. ఇక కే‌జి‌ఎఫ్ సిరీస్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగింది. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రాబోతుండడంతో ” సలార్ ” పై అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. దాంతో ఈ మూవీకి సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చిన విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఇప్పటికే మూవీ నుంచి కొన్ని పోస్టర్స్, వీడియో క్లిప్స్ షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన సంగతి తెలిసిందే. లీక్ అయిన పోస్టర్స్ లో ప్రభాస్ లుక్ మెకోవర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. .

మలయాళ హీరో పృధ్వీ రాజ్ “సలార్ ” మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మలయాళ నటుడు సలార్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కిస్తున్న విధానంకు తను ఫిదా అయినట్లు పృధ్వీ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఎవరి ఊహలకు అందని రీతిలో ఉంటాయని, ప్రశాంత్ నీల్ విజన్ సూపర్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పృధ్వీ రాజ్ చేశాడా లేదా లేదా అభిమానులు ఎడిట్ చేసి పోస్ట్ చేశారో తెలియదు గాని ప్రస్తుతం సలార్ మూవీ గురించి పృధ్వీరాజ్ చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక సలార్ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి కే‌జి‌ఎఫ్ తో ప్రశాంత్ నీల్, బాహుబలితో ప్రభాస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ” సలార్ ” ఎంకెలాంటి సంచలనలు నమోదు చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

SSMB28 పై ఇన్ని డౌట్లా.. క్లారిటీ వచ్చేనా?

చిరుకు సమ్మర్ లో కూడా తప్పని పోటీ..!

హీరోలను విలన్లుగా మారుస్తున్న స్టార్ డైరెక్టర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -