- దెబ్బలు తగులుతున్నాయని కలత
మనకు చిన్న జ్వరమో, ఆరోగ్యం బాగా లేకపోతేనే నదురు తగిలిందని ఇంట్లోవాళ్లు మనకు ఉప్పుతోనో, చీపురుతోనో దిష్టి తీశారు. ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి తూ తూ తూ అంటూ చుట్టూ ఉప్పు తిప్పి పడేస్తారు. లేదా చీపురుతో.. గుమ్మడికాయతో దిష్టి తీసి పడేస్తారు. ఇది మూఢ నమ్మకం అని మనం పట్టించుకోం. కానీ అది తీసిన తర్వాత తగ్గడం ఆశ్చర్యం కలిగించే అంశం. వీటిని సినీ ప్రముఖులు కూడా నమ్ముతారని తెలుస్తోంది. తనకు వరుసగా గాయాలవుతున్నాయని, తాను నటించిన సినిమాలు అపజయాలు పొందుతున్నాయని కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ దిగులు చెందారు. ఆమెకు దిష్టి తగిలిందని భావించి తన స్నేహితురాలితో దిష్టి తీయించుకుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందన్న సామెత ఉంది. దాన్ని తాను నమ్మినట్టు తెలుస్తోంది.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో ప్రగ్యా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే అవి సరిగ్గా ఆడలేదు. సాయి ధరమ్ తేజ్తో నటించిన నక్షత్రం సినిమా కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. ఈ మధ్య ప్రగ్యా జైస్వాల్కు తాను పాల్గొంటున్న చిత్రీకరణల్లో వరుసగా దెబ్బలు తగులుతున్నాయట… ఆ దెబ్బలతో ఆమె కలత చెందారు. అందుకే ఈమెకు దిష్టి తగిలిందని సన్నిహితులు చెప్పారట. అసలే అందాల భామ .. కాబట్టి తప్పకుండా దిష్టి తగిలే ఉంటుంది అని ఆమె స్నేహితులు భావించి దిష్టి తీశారు. ఈ చిత్రాలు ప్రగ్యా సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది. తన స్నేహితులు దిష్టి తీస్తుంటే ప్రగ్యా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది.