Wednesday, May 1, 2024
- Advertisement -

మరొక సినిమా లైన్లో పెట్టిన అఖిల్

- Advertisement -

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా మూడు సినిమాలు చేసాడు కానీ ఒక్క సినిమాతో కూడా మంచి హిట్ ను అందుకోలేకపోయాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో విడుదలైన ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా డిసాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్యనే అధికారికంగా లాంచ్ చేసిన ఈ సినిమా షూటింగ్ ను బ్రేక్ లేకుండా త్వరగా పూర్తిచేసి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు కానీ అప్పుడే అఖిల్ మరొక సినిమాలు లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ‘అ!’ సినిమాతో దర్శకుడిగా మారిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ‘కల్కి’కి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రశాంత్ వర్మ అఖిల్ కి కలిసి ఒక ఆసక్తికరమైన కథన నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. అఖిల్ బౌండ్ స్క్రిప్ట్ తయారుచేయమని చెప్పాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -