Monday, April 29, 2024
- Advertisement -

ఘనంగా సత్కరించిన టి.సుబ్బిరామిరెడ్డి

- Advertisement -

ఆయన ఏం చేసినా ఇలాగే ఉంటుంది. ఏం చేయకపోయినా ఇలాగే ఉంటుంది. ఆయనే ప్రముఖ పారిశ్రామికవేత్త టి.సుబ్బిరామిరెడ్డి. అందాలతార, ప్రముఖ నటి ప్రియాంకచోప్రాకు సుబ్బిరామిరెడ్డి బంగారు గాజులు బహుమానంగా ఇచ్చారు. పద్మ పురస్కారం పొందిన సందర్భంగా ప్రియాంక చోప్రా గౌరవార్ధం సుబ్బిరామిరెడ్డి విందు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈ గాజులను ప్రదానం చేశారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు, సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకిరెడ్డి బంగారు గాజులను ప్రియాంక చోప్రాకు తొడిగారు. దేశంలో కళలను ప్రోత్సహించేందుకు టిఎస్‌ఆర్ ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలు చేపడుతుందోని సుబ్బిరామిరెడ్డి అన్నారు.

ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గా ఎంపికైందని, తర్వాత బాలీవుడ్ లోనూ, హాలీవుడ్ లోనూ తన నటనతో తానేంటో నిరూపించుకున్నారని ఆయన కితాబునిచ్చారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -