తెలుగు లో సూపర్ హిట్ సాధించిన చిత్రం అర్జున్ రెడ్డి ని తమిళం లో ఆదిత్య వర్మ అనే పేరు తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమా లో విజయ్ పాత్ర ని పోషిస్తున్నాడు. గిరీశయ్య ఈ సినిమా కి దర్శకుడి గా పని చేస్తున్నారు. హిందీ హీరోయిన్ బానిటా సందు ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది.
నిజానికి ఈ సినిమాని సీనియర్ దర్శకుడు బాలా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. కానీ దర్శకుడికి నిర్మాతలకి తలెత్తిన విభేదాల వలన బాలా ఈ సినిమా నుండి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు రెండో సారి గిరీశయ్య ఈ సినిమా ని డైరెక్ట్ చేసాక కూడా నిర్మాతలకి ఔట్పుట్ నచ్చలేదు అని టాక్ నడుస్తుంది. ఈ రెండో వర్షన్ ని కూడా నిర్మాతలు విడుదల కాకుండా ఆపాలని చూస్తున్నారట. ఈ సారి కూడా నిర్మాతలకి అనుగుణం గా సినిమా తయారు కాలేదని వారి వాదన.
ప్రస్తుతం కేవలం పుకారు గా నే ఉన్న ఈ వార్త లో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.