Thursday, May 2, 2024
- Advertisement -

ఇకపై ఆ సినిమాలు మాత్రమే చేస్తా అంటున్న పూరి

- Advertisement -

పూరి జగన్నాథ్ తన చిత్రం ఇస్మార్ట్ శంకర్ విషయం లో చాలా సంతోషం గా ఉన్నాడు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా ఇచ్చిన కిక్ తో ఇక పై మాస్ సినిమాలు మాత్రమే చేయాలి అని నిర్ణయించుకున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించాడు. అంతే కాకుండా త్వరలో నే ఇస్మార్ట్ శంకర్ కి రెండో భాగం గా డబుల్ ఇస్మార్ట్ ని మొదలు పెట్టనున్నట్లు కూడా పూరి తెలిపాడు.

“అందరూ నన్ను చాలా పొగుడుతున్నారు. నేను ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఫస్ట్ టైం ఎలాగైనా హిట్ కొట్టాలి అని ఈ సినిమా తీశాను. మీ అందరి ఆదరణతో ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమా చూసి చాలా మంది నా మిత్రులు అప్రిసియేట్ చేసారు. అలాగే నన్ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్‌. బాలకృష్ణ గారు ఈ రోజే సినిమా చూస్తున్నారు. ఆయనకు నా ధన్యవాదాలు. అఖిల్, రానా ఇలా ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. నేను ఇప్పటినుండి ఇలాంటి మాస్ సినిమాలే తీయాలని డిసైడ్ అయ్యాను. హిట్ సినిమాలే తీస్తాను. త్వరలోనే తెలంగాణలో సక్సెస్ టూర్‌ని ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్ష‌కులంద‌రినీ వచ్చి కలుస్తాం. అలానే త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్ చేస్తాను.” అని పూరి జగన్నాథ్ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -