- Advertisement -
పూరి, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న 150 వ చిత్ర షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకి ఒక ప్రముఖ న్యూస్ చానల్ షాక్ ఇచ్చింది.
అదేంటంటే అసలు పూరికి చిరంజీవితో సినిమా డైరెక్ట్ చేయడం ఇష్టం లేదట. ఈ న్యూస్ ఫేస్బుక్లో హల్చల్ చేస్తోంది.. దీనిపై పూరిజగన్నాథ్ తీవ్రంగా స్పందించారు.. “దయచేసి ఇలాంటి నిరాధారమైన కథనాలని వ్యాప్తి చేయవద్దు ఇటువంటి వార్తా కథనాలు నన్ను, అభిమానులని బాధకి గురి చేస్తాయి.” అని ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు.. కొన్ని గంటల తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కాని పూరిజగన్నాథ్ తన official ఫేస్బుక్ నుంచి సదరు ఫోస్ట్ని తీసేశారు..