Thursday, April 25, 2024
- Advertisement -

ప్రభాస్ అభిమానులకు పండుగే

- Advertisement -

కరోనా తగ్గుముఖం పడుతుండటంతో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన ఆర్.ఆర్.ఆర్.. విడుదల తేదీని సైతం చిత్ర బృందం ప్రకటించింది. ఆచార్య, భీమ్లానాయక్ చిత్ర బృందాలు మరోసారి రిలీజ్ డేట్స్ ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు ఇప్పుడుప్పుడే ఎత్తేస్తుండటంతో ప్రేక్షకులు సైతం థియేటర్లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఈ క్రమంలో రాధేశ్యామ్ టీం సైతం విడుదల తేదీ ప్రకటించేసింది. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ వెల్లడించింది. అంటే ఆర్ఆర్ఆర్ విడుదల కంటే ముందే రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, విధికి మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపిస్తూ తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన ఈసినిమా విడుదలపై గత కొన్నిరోజుల నుంచి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం డైరెక్ట్‌ ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇటీవల నెట్టింట్లో గట్టి ప్రచారమే జరిగింది.

అయితే ఈ ప్రచారానికి చిత్ర బృందం ఫుల్ స్టాప్ పెట్టింది. థియేటర్‌ రిలీజ్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రభాస్‌ హస్తసాముద్రిక నిపుణుడిగా విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక, పూజాహెగ్డే ప్రేరణగా అలరించనున్నారు. అనుకోకుండా ప్రేమలో పడిన వీరిద్దరిని విధి ఒక్కటి చేసిందా? లేక దూరం చేసిందా? ప్రేమను గెలుచుకునేందుకు వీరిద్దరూ విధితో చేసిన పోరాటమేమిటి? అనేది కథాంశం. చిత్రబృందం ప్రకటనతో ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

తెర‌పై రీఎంట్రీ ఇస్తున్న ప‌వ‌ర్ స్టార్ మాజీ భార్య‌

జోరుమీదున్న రంగ‌మ్మ‌త్త‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -