ఒక పక్క బుల్లి తెరపైన దుమ్మురేపుతోంది. మరో పక్క వెండి తెరపైనా విలక్షణ పాత్రలతో పుల్ స్వింగ్ మీదుంది రంగమ్మత్త. అదేనండీ క్రేజీ యాంకర్ అనసూయ. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప’లో దాక్షాయణిగానూ మంచి మార్కులే కొట్టేసింది. సునీల్ కు జోడీగా తనదైన నటనతో లేడీ విలనిజాన్ని పండించింది. పుష్ప ఇటు దక్షిణాదిలోనూ.. అటు బాలీవుడ్ లోనూ బాక్సాఫీసు బద్దలు కొట్టింది. హీరో అల్లు అర్జున్ తో పాటు ఈ సినిమా పాత్రదారులందరికీ మంచి పేరే వచ్చింది.
ఇప్పుడు పుష్ప టూ తీసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. దాంతో ‘పుష్ప’ రెండో భాగంలోనూ అనసూయ పాత్ర కొనసాగింపు ఆసక్తిని రేపుతుందట. ఇదిలా ఉంటే.. రవితేజ ‘ఖిలాడి’ చిత్రంలో కూడా అనసూయ ప్రేక్షకులకి బోలెడన్ని సర్ప్రైజులు ఇవ్వబోతోందని టాక్. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోందట. మొదటి పాత్ర రెబల్ అయితే, రెండో పాత్ర బ్రహ్మణ యువతి అని సమాచారం.
అయితే ఇందులో ఒక పాత్ర చనిపోతే, రెండో పాత్ర చివరి వరకూ ఉంటుందట. ఒక విధంగా ఇది అనసూయకి ఫుల్ లెంత్ రోలట. ఇక కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రంలో కూడా అనసూయ చెప్పుకోదగ్గ పాత్ర చేస్తోందని సమాచారం. అలాగే… మలయాళంలో మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ చిత్రంలోనూ, తమిళంలో విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమాలోనూ అనసూయ వెరైటీ పాత్రలు చేస్తోంది.
మరో సీక్వెల్ కు సిద్ధమవుతున్న డార్లింగ్
ఖిలాడీ డైరెక్టర్కు ఓ రేంజ్ గిఫ్ట్
మెన్స్ టాయిలెట్లోకి వెళ్లిన హీరోయిన్స్.. అలా చేస్తే తప్పేంటి ?