Thursday, May 2, 2024
- Advertisement -

బాగున్నారా అంటే వస్తావా అన్నారు : నటి రాగిణి

- Advertisement -

నటి రాగిణి.. అమృతం, నాన్న, అక్క చెల్లెళ్లు, అగ్ని సాక్షి వంటి తదితర సీరియల్స్ లో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సిరియల్స్ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. తాజాగా రాగిణి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

తన ఫ్యామిలీ గురించి చెబుతూ.. తాము మొత్తం 13 మంది సంతానమని అందులో 12వ సంతానం తాను ఆని తెలిపింది. సినిమాలో మంచి నటిగా గుర్తింపు పొందాలని సినీ పరిశ్రమకు వచ్చానని.. అయితే మొదట్లో హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. కానీ తన వద్ద ఆర్దిక ప్రొత్సాహం, స్థోమత లేకపోవడంతో ఆ అవకాశాలు పోయాయని తెలిపింది. ఇక సినీ పరిశ్రమలో మన వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవిస్తారని తెలిపింది. అలాగే తెలిసిన వాళ్లే కదా అని కొందరు వ్యక్తులను ఏంటి సార్ బాగున్నారా అడిగితే తన వైపు ఎగాదిగా చూసి వస్తావా అని అడిగారని కానీ నమస్కారం సార్ అంటే మాత్రం ప్రతి నమస్కారం చేసి గౌరవించారని చెప్పుకొచ్చింది.

ఇక సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఛాన్సుల కోసం చాలా కష్టపడ్డానని.. తెలిసిన వాళ్ల ద్వారా దూరదర్శన్ ఛానల్ లో ప్రసారం అయ్యే సీరియళ్లలో కూడా నటించానని తెలిపింది. తనకు 12 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారని.. కానీ తన భర్త డబ్బు కోసం చెడ్డ పనులు చేయమని చెబుతుండడంతో తనకు నచ్చక వదిలేశానాని, తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిపింది. ఇక అంతేకాకుండా తన కొడుకు విదేశాల్లో ఉన్నాడని.. తనను బాగా చూస్కుంటున్నాడని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -