Monday, April 29, 2024
- Advertisement -

రాజ్‌మౌళి- చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో మ‌రో భారీ మూవి రాబోతుందా..

- Advertisement -

చరణ్ కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ ఎలాంటి రికార్డులను తిరగరాసిందో తెలిసిందే. ఈ సినిమా తరువాత రాజమౌళికి .. మెగా కాంపౌండ్ కి మధ్య కాస్త దూరం పెరిగిందనే టాక్ వచ్చింది. కొన్ని సంఘటనలు కూడా అందుకు బలాన్ని చేకూర్చాయి. అయితే ఇటీవల కాలంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే, రాజమౌళికి .. మెగా కాంపౌండ్ కి మధ్య దూరం తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది.

చిరంజీవి కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా చెబుతోన్న ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా మోషన్ పోస్టర్ ను రాజమౌళి రిలీజ్ చేయడం, ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇదంతా చూస్తుంటే మెగా కాంపౌండ్ కి రాజమౌళి మళ్లీ దగ్గరైపోయినట్టేనని చెప్పుకుంటున్నారు.

ఇదంతా చూడగానే ‘మగధీర’ కాంబినేషన్ మళ్లీ చూడబోతున్నామన్న ప్రచారం మొదలైపోయింది. తన తర్వాతి సినిమా ఏదో ఇంకా తేల్చని సమయంలో ఓ పెద్ద దర్శకుడు.. ఇంకేదైనా సినిమాకు సంబంధించిన వేడుకకు హాజరయ్యాడంటే.. ఆ కాంబినేషన్ తెరమీదికి రాబోతుందన్న సంకేతాలు రావడం స‌హ‌జం.

ఐతే ఈ ఫంక్షన్ కు ముడిపెట్టకుండా మామూలుగా చూస్తే.. రాజమౌళి-రామ్ చరణ్ కాంబినేషన్ రిపీటయ్యే అవకాశాల్ని పూర్తిగా అయితే కొట్టిపారేయలేం. ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ పూర్తయ్యాక చరణ్ ఏం చేయాలో ఏమీ తేల్చుకోలేదు. మరోవైపు రాజమౌళి కూడా తన తర్వాతి సినిమాకు హీరో విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు.

ప్ర‌స్తుతం ఏహీరో అందుబాటులోలేరు. ఎన్టీఆర్.. ‘జై లవకుశ’ తర్వాత త్రివిక్రమ్.. కొరటాల శివలతో సినిమాలు చేయాల్సి ఉంది. ప్రభాస్ ‘సాహో’లో మునిగిపోయాడు. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’తో పాటు లింగుస్వామి సినిమాను లైన్లో పెట్టాడు. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ కూడా వేరే కమిట్మెంట్లతో ఉన్నారు. ఒకవేళ తాను ఓకే చేసిన కథకు చరణ్ సరిపోతాడనుకుంటే అతడితోనే సినిమా చేసే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఐతే హీరో ఎవరైనప్పటికీ రాజమౌళి ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్యకు చేయడం మాత్రం ఫిక్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -