Sunday, May 5, 2024
- Advertisement -

అను ఇమ్మాన్యుయేల్‌కు భారీ ఆఫ‌ర్‌

- Advertisement -
  • ఇద్ద‌రికి జోడీగా అను అంట‌
  • రాజ‌మౌళి సినిమాలో చర‌ణ్‌, తార‌క్‌తో జంట‌గా

ఇద్ద‌రు యువ హీరోలతో భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా ఎస్‌.ఎస్‌ రాజమౌళి అస‌లు ప్ర‌క‌టించాడో లేదో కానీ దాని గురించి ఊహాగానాలు, టాపిక్‌లు మాత్రం హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇప్పుడు మ‌రొక ముచ్చ‌ట వినిపిస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో తీస్తున్న‌ మల్టీస్టారర్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తుంద‌ట‌. చెర్రీ, తారక్‌ ఇద్ద‌రికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటించబోతున్నట్లు సమాచారం.

ఒక్క సినిమాతో అంద‌రీ త‌న‌పై వేసుకున్న అను వ‌రుస సినిమాలు చేస్తోంది. మ‌జ్ను సినిమాతో అద్భుత న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అను ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ సినిమా చేసింది. ఆక్సిజ‌న్ సినిమా చేసినా అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఆ సినిమా త‌ర్వాత భారీ ఆఫ‌ర్ వ‌చ్చి ప‌డింది. ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కల్యాణ్ సినిమా అజ్ఞాత‌వాసితో తెలుగు తెర‌పై మెర‌వ‌నుంది.

ఇప్పుడు రాజమౌళి చిత్రంలో చరణ్‌కి, తారక్‌కి జోడీగా అను నటిస్తుంద‌నే విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఆల్రెడీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌కి జోడీగా ఒప్పుకుంది. అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా, నాగచైతన్య సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ ల‌లో కూడా అను ఎంపిక‌య్యింది. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్‌, తార‌క్ న‌టిస్తున్న సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత చరణ్‌, తారక్‌తో రాజ‌మౌళి భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా ప్రారంభించ‌నున్నార‌ట‌. ఎందుకంటే జ‌క్క‌న సినిమా అంటే మినిమ‌మ్ సంవ‌త్స‌రం డేట్స్ ఇవ్వాల్సిందే. అందుకే ఆ సినిమాకు ముందే తాము క‌మిట్ అయిన సినిమాలు పూర్తిచేసే ప‌నిలో రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -