ఇంకా హీరోయిన్గా ఎంట్రీ కానే లేదు గానీ.. తొలి సినిమాకు తీసుకుంటున్న సంపాదనను విరాళంగా ఓ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చేసింది. ఆమె ఎవరో సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాని. ప్రస్తుతం శివాని అడవి శేశ్ హీరోగా నటిస్తున్న ‘2 స్టేట్స్’ సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమా కోసం ఇటీవల తన తొలి రెమ్యునరేషన్ శివాని అందుకుంది. ఆ సంపాదనను దాచుకోవడమో.. ఎంతో ఇష్టమైంది కొనుక్కోవడమో చేయలేదు శివాని. చదువుకు దూరమైపోతున్న పిల్లలకు సహాయం చేసేందుకు మంచులక్ష్మి నిర్వహిస్తున్న టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థకు తన తొలి సంపాదనను మొత్తం ఇచ్చేసింది.
‘‘నా తొలి సంపాదన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేయడం చాలా ఆనందంగా ఉంది. నా సహాయం చిన్నదే అయినా నేను గర్వపడే పనిచేశానని చెప్పుకోగలను. మా అమ్మనాన్నల అడుగుజాడల్లో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేస్తూ శివాని చెప్పింది.
హిందీలో సూపర్ హిట్టయిన ‘2 స్టేట్స్’ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది